Sunday 10 January 2016

ఆ న‌గ‌రం కింద బాంబులు, ఆర్డీఎక్స్‌లే

05450401111

యుద్ధం కోసం ఎన్నో ర‌కాల ఆయుధాలు, బాంబులు తీసుకొస్తారు. మ‌రి అవ‌న్నీ యుద్ధంలో ఉప‌యోగిస్తారా అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. వాటిని ప‌రీక్షించి స‌రిగా పనిచేయ‌ని, నాణ్య‌త లేనివాటిని ఒక ప‌క్క‌న ప‌డేస్తారు. వాటిని జాగ్ర‌త్త‌గా ఒక చోట ఉంచుతారు. ఇప్పుడు అలా దాచిన ప్ర‌దేశంలో ఏకంగా ఒక న‌గ‌ర‌మే పుట్టుకొచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఆన‌గ‌రం పేలిపోయేందుకు సిద్ధంగా ఉంది.
1999 నాటి కార్గిల్ యుద్ధం గుర్తుందిగా. ఆ యుద్ధ స‌మ‌యంలో పేలని, తిరస్కరించిన వేలాది బాంబులను మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా (ఓఎఫ్‌కే)లో భూగర్భంలో పాతిపెట్టారు. అది ఇప్పుడు పూర్త‌గా జ‌న‌స‌మ్మ‌ర్ధం ఉండే ప్రాంత‌మైంది. అక్క‌డ దాచిపెట్టిన సామ‌గ్రి గురించి తెలుసుకుంటే.. క‌ళ్లు చెద‌ర‌క మాన‌వు. ఓఎఫ్‌కే ప్రాంతంలో లక్షకు పైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్70, బీఎంపీ2 షెల్స్ ఉన్నాయని అంచనా. కార్గిల్ యుద్ధం నాటి పేలుడు పదార్థాలను దాచి ఉంచిన మ్యాగజైన్ ఎఫ్12 అనే ప్రాంతం అయితే మరింత ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు.. ఏ దేశంతోనైనా యుద్ధం చేయడానికి సరిపడగా ఉన్నాయని జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ సభ్యుడు అరుణ్ దూబే తెలిపారు.
ఇవి మాత్రమే కాదు.. రష్యన్ ఆయుధాల ఎగుమతి సంస్థ మెసర్స్ ‘రోసోబోరోన్ ఎక్స్‌పోర్ట్’ 2013లో సరఫరా చేసిన దాదాపు 4వేల కిలోల ఆర్డీఎక్స్ కూడా జబల్‌పూర్ నగరం కిందే నిక్షిప్తమై ఉంది. నాణ్యతా పరీక్షలలో ఇది విఫలం కావడంతో దాన్ని ఉపయోగించలేదని, 2014లో పాత ఆర్డీఎక్స్‌ను తీసుకోకుండానే కొత్త స్టాకును రష్యన్ సంస్థ సరఫరా చేసిందని ఓఎఫ్‌కే ఉద్యోగి ఒకరు తెలిపారు. ఇలా పలు రకాల పేలుడు సామగ్రి మొత్తం ఆ నగరంలో భూమి కింద ఉంది. ఇవ‌న్నీ ఒకేసారి పేలితే.. భూకంపం సంభవించి, న‌గ‌రం నామ‌రూపాలు లేకుండా అయిపోతుంద‌ట‌. కొన్నేళ్లుగా ఇక్కడ వరుసపెట్టి పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా చిన్నపాటి పేలుడు సంభవించి, ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. తాము ఈ అంశాన్ని పలుసందర్భాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
please share it..

No comments:

Post a Comment